వాస్తవం ప్రతినిధి: కరోనా రాకాసి కోరల నుంచి జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వ్యాక్సిన రాకతో అంతా ఉపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. తాజాగా బ్రిటన్ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్కు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చారు వైద్యులు.
బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2, రాజు ఫిలిప్కు కరోనా టీకా తీసుకున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించింది. 99 ఏళ్ల ఫిలిప్,94 ఏళ్ల ఎలిజిబెత్కు వారి ఫ్యామిలీ డాక్టర్ విండ్సోర్ టీకాలు అందజేశారు. వ్యాక్సిన్పై వస్తున్న ఆపోహలు తొలగించేందుకు తాము వ్యాక్సిన్ తీసుకున్నామన్న విషయాన్ని బహిరంగ పరచాలని రాణి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్రకటన వెలువడింది. కాగా, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బ్రిటన్ రాజు, రాణి ఇదే ప్యాలెస్లో గడిపారు. అదే సమయంలో వీరి పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ వైరస్ బారిన పడ్డారు. మనవడు విలియమ్స్కు కూడా ఏప్రిల్లో కొవిడ్ పాజిటీవ్గా తేలింది.
అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఎలిజిబెత్, ఫిలిఫ్ క్రిస్మస్ను మాత్రం బెర్క్షైర్ రెసిడెన్సీలో జరుపుకొన్నారు. బ్రిటన్లో ఇప్పటి వరకు 1.5 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ చేశారు. బ్రిటన్లో 80ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యతగా టీకాలు అందిస్తున్నారు. బ్రిటన్లో ఇప్పటికే మూడు సంస్థల కొవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఫైజర్-బైయోఎన్ఎన్టెక్, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా, మోడెర్నా టీకాలు ఉన్నాయి.