వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ పీఠం దక్కితే వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఎల్ఆర్ఎస్ కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను ఆయన హైదరాబాద్ లో విడుదల చేశారు. సామాన్యుడి ఆకాంక్షల మేరకే తమ మేనిఫెస్టోను రూపొందించామని ఆయన చెప్పారు. ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే ఇటీవల నగరం మునిగిపోయిందని ఆయన ఆరోపించారు.
బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..
గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్
నాలాలు, డ్రైనేజీల ఆధునికీకరణ కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి
ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్కో ఫ్లై ఓవర్
పార్కింగ్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు
జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు
జీహెచ్ఎంసీలోని ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు
నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు
125 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు
అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు
విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు, వై-ఫై సౌకర్యం
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు
పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్
లంచాలు లేని, నూటికి నూరుశాతం పారదర్శక జీహెచ్ఎంసీ ఏర్పాటు
మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు
మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్
గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు
గ్రేటర్లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా
కులవృత్తులకు ఉచిత విద్యుత్
ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ
వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక
వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేల చొప్పున సాయం