వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్లో ఈ నెల 7న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన నేహా రెడ్డి మద్దిక అనే మహిళ మృతిచెందారు. నవంబర్ 7న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సౌత్ 1st స్ట్రీట్, వెస్ట్ మేరీ స్ట్రీట్ మధ్య రెండు వాహనాలు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేహా రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు నేహ రెడ్డి స్నేహితురాలు ప్రియాంక రెడ్డి తెలిపారు. మృతురాలికి అమెరికాలో ఎవరూ లేకపోవడంతో మృతదేహాన్ని హైద్రాబాద్కు తరలించేందుకు గోఫండ్మీ ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు ప్రియాంక చెప్పారు.