వాస్తవం ప్రతినిధి: సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన మహిళా పోలీసుకు సింగపూర్ న్యాయస్థానం సోమవారం ఏడు నెలల జైలు శిక్ష విధించింది. డిపార్ట్మెంట్ జారీ చేసిన రెండు ఐప్యాడ్లను దుర్వినియోగం చేసి నందుకు గాను హేమవతి గుణశేఖరన్(37)కు కోర్టు ఈ శిక్ష వేసింది. ఈ రెండు ఐప్యాడ్లను హేమవతి 300 సింగపూర్ డారల్లకు(రూ.16,092) కుదువ పెట్టినట్లు కోర్టు విచారణలో తేలింది. అలా కుదవ పెట్టిన ఐప్యాడ్లను ఆమె రీడీమ్ చేయకపోవడంతో షాపు వారు వేరే వ్యక్తులకు విక్రయించారు. దీంతో ఆమెపై సింగపూర్ పోలీస్ ఫోర్స్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆమెకు సింగపూర్ న్యాయస్థానం ఏడు నెలలు జైలు శిక్ష విధించింది.